బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ సినిమాల కన్నా సేవా కార్యక్రమాలతోనే అందరి మనసులని గెలుచుకుంటున్నారు. సామాజిక బాధ్యత కలిగిన పౌరుడిగా ఆయన ఎన్నో సామాజిక సేవలు చేశారు. అవసరమైన వారికి సహాయం అందించడంలో అక్షయ్ ఎప్పుడు ముందుంటారు. తాజాగా ఆయన బీహార్ వరదబాధితులకి తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు . వరదల వలన 25 కుటుంబాలు రోడ్డున పడగా, ఒక్కో కుటుంబానికి 4 లక్షల చొప్పున సాయం అందించాలని ఆయన ప్రతిపాదించారు. చాత్ పూజ శుభ సందర్భంగా రూ. 1 కోటి రూపాయల మొత్తాన్ని అందజేస్తారు. ప్రకృతి కోపానికి మనుషులు రోడ్డున పడుతున్నారు . వారికి సాధ్యమైనంత సహాయం చేసేందుకు అందరూ ముందుకు రావాలని అక్షయ్ పిలుపునిచ్చారు. తోటి పౌరుల జీవితాలను పునర్నిర్మించడం కోసం చేసే సహాయం తనకు ఎనలేని సంతృప్తిని ఇస్తుందని అక్షయ్ అన్నారు. అక్షయ్ నటించిన హౌస్ఫుల్ 4 చిత్రం రీసెంట్గా విడుదలై మంచి విజయం సాధించింది.
మరోసారి మంచి మనసు చాటుకున్న అక్షయ్